కాగజ్‌నగర్‌ పరిశ్రమలో గ్యాస్‌ లీక్.. కార్మికుడికి అస్వస్థత!

  • ఎస్‌పీఎం కాగితపు పరిశ్రమలో ఘటన
  • ఈ రోజు తెల్లవారు జామునే గ్యాస్ లీక్
  • నాగుల రాజం అనే కార్మికుడికి అస్వస్థత
  • ఆసుపత్రికి వెళ్లడంతో గ్యాస్ లీక్‌ ఘటన వెలుగులోకి
కుమరం భీమ్ ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో కలకలం చెలరేగింది. అక్కడి ఎస్‌పీఎం కాగితపు పరిశ్రమలో గ్యాస్‌ లీక్‌ అయింది. అయితే, ఈ ఘటన బయటకు రాకుండా ఆ పరిశ్రమ యాజమాన్యం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసింది. అయినప్పటికీ ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ రోజు తెల్లవారు జామునే ఈ ఘటన జరిగినప్పటికీ ఆ యాజమాన్యం ఈ విషయాన్ని బయటకు రాకుండా చూసుకుంది. గ్యాస్‌ లీక్‌ ఘటనలో నాగుల రాజం అనే కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు.. దీంతో అలాగే ఇంటికి వెళ్లిపోయాడు.. ఆ తర్వాత ఇంట్లో ఆయన పరిస్థితి మరింత దిగజారడంతో ఆయనను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు.

దీంతో వైద్యులు ఆయనను ప్రశ్నించడంతో ఆ విషయం బయటపడింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ కాగితపు పరిశ్రమలో సుమారు 20 మంది కార్మికులు ఉన్నట్లు తెలిసింది. విశాఖపట్నంలో గ్యాస్‌ లీక్‌ ఘటన మరవకముందే ఇటువంటి ఘటనలే పలు చోట్ల వెలుగులోకి వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.

Kumaram Bheem Asifabad District
Vizag Gas Leak
Telangana

More Telugu News